ఈ మధ్య ఏపీలో తెలుగుదేశం నాయకుల మీద పెడుతున్న కేసులు సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు దీనిపై సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. 

 

తమ నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులని.. కార్యకర్తలని అరెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 108 అంబులెన్సుల కుంభకోణం 300 కోట్లు సాక్ష్యాలతో సహా బయటపెట్టామని అన్నారు. బాధ్యులైన మీపార్టీ నాయకుల మీద వారి బంధువుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: