హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా వందల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణా లో మరణాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇప్పటికే 200 పైగా కరోనా తో మరణించారు. ఇక తాజాగా ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులు కూడా కరోనా తో మరణిస్తున్నారు. 

 

తాజాగా ఖైరతాబాద్ లో 40 ఏళ్ళుగా క్లీనిక్ నిర్వహిస్తున్న డాక్టర్ జ్ఞానేశ్వర్ కరోనా కారణంగా మరణించారు. ఈ నెల 16 న ఆయన జ్వరం తో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నెల 18 న ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. దీనితో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వైద్యం చేసిన వాళ్లకు కూడా కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: