కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిఎం యడ్యురప్ప అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కస్టర్లలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. బెంగళూరులో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున ముందస్తు చర్యలను కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సిఎం.
కస్టర్లలో ముఖ్యంగా కేఆర్ మార్కెట్, పరిసరాల్లోని సిద్దపుర, వీవీ పురం, కలసిపాళ్య తదితర ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలి అని ఆయన స్పష్టం చేసారు. క్వారంటైన్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్న ఆయన... అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.