ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది. కరోనా కట్టడికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో కరోనా కేసులతో పాటుగా అక్కడ మరణాలు కూడా కాస్త అదుపులోనే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక అస్సాం లో అయితే రికవరీ రేటు భారీగా పెరుగుతుంది. 

 

ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ... ఈ రోజు వరకు, మా రికవరీ రేటు 63.3% కాగా, మరణాల రేటు 10 మరణాలతో 0.16% గా ఉందని చెప్పారు. మొత్తం అక్కడ బయటపడిన కరోనా కేసులు 5586 అని...  వీటిలో 2170 మంది రోగులు కరోనా తో చికిత్స పొందుతున్నారని... 3521 మంది రోగులు కోలుకున్నారని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: