ఒక పరువు హత్యకు సంబంధించి మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. అది ఏంటీ అంటే... పరువు హత్యకు గురైన ఒక దళిత యువకుడు శంకర్ హత్య కేసుకి సంబంధించి సోమవారం ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని సవరించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న యువతి తండ్రి చిన్నస్వామికి కింది స్థాయి కోర్ట్ మరణ శిక్ష విధించింది. 

 

దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 5 మందికి ట్రయల్ కోర్ట్ మరణ శిక్షను రద్దు చేసి 25 ఏళ్ళ జీవిత ఖైదు కి మారుస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తీర్పుపై తాము సుప్రీం కోర్ట్ కి వెళ్తామని బాధిత కుటుంబం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: