ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాల విషయంలో సిఎం జగన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక తాజాగా మరోసారి సంక్షేమ కార్యక్రమానికి భారీగా నిధులను విడుదల చేసింది ఏపీ సర్కార్. 

 

పేదలకు ఇళ్ళు’ కార్యక్రమానికి గాను ప్రభుత్వం రూ. 459 కోట్లను విడుదల చేస్తూ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మొత్తం ఎనిమిది జిల్లాలకు గానూ ఈ నిధులను విడుదల చేసింది సర్కార్. విజయనగరం, శ్రీకాకుళం, కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు విడుదల చేసింది. నెల్లూరు, కర్నూలు జిల్లాలకు రూ. 80 కోట్ల చొప్పున, విశాఖపట్నం జిల్లాకు 39 కోట్లను విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: