ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. రోజు రోజు కరోనా కేసులు తీవ్రమవడం తో ఇప్పుడు ప్రజలు కూడా బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. అయితే కేసులు ఉన్న ప్రాంతాలు, జిల్లాల్లో ఇప్పుడు అధికారికంగా లాక్ డౌన్ ని ప్రకటించే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. 

 

కృష్ణా గుంటూరు ప్రకాశం అనంతపురం కర్నూలు జిల్లాల్లో లాక్ డౌన్ ని అమలు చెయ్యాలి గోదావరి జిల్లాల్లో కూడా లాక్ డౌన్ ని అమలు చేస్తే మంచిది అనే ఆలోచనలో సిఎం వైఎస్ జగన్ ఉన్నారు అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని గవర్నర్ భేటీ లో జగన్ ప్రస్తావించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: