మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తాడోబా- అంధారి టైగర్ రిజర్వ్ సమీపంలో ఒక గని స్థలాన్ని వేలం వెయ్యాలి అని కేంద్రం భావించడం పై మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే ఫైర్ అయ్యారు. 29 ఏళ్ళ ఈ యువ మంత్రి దానిని వేలం వేయవద్దు అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కి ఒక లేఖ రాసారు. 

 

తడోబా మరియు అంధారి వన్యప్రాణుల కారిడార్‌ కు చెందిన స్థలం అని... అది నాశనమవుతుంది అని మనకు తెలిసినప్పుడు వృధా ప్రయాస ఎందుకు అని... దాని కోసం సమయం శక్తిని ఎందుకు వృధా చెయ్యాలి అని ఆయన ప్రశ్నించారు. కాగా ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా తెలంగాణా ప్రాంతానికి పులులు వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: