జమ్మూ కాశ్మీర్ లో మూడు రోజుల వ్యవధిలో మరో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఉగ్రవాదులు ఉన్నారు అనే పక్కా సమాచారం తో గాలింపు చర్యలు చేపట్టారు సైనికులు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ ని నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలోని బాండ్‌జూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. 

 

పోలీసులు, భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. ఎన్‌కౌంటర్‌లో ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు అధికారులు. అతనికి తోడ భాగం లో బుల్లెట్ తగిలింది అని ప్రాణాలకు ఏ ప్రమాదం లేదు అని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఎన్కౌంటర్ లో భారత బలగాలు కాల్చి చంపాయి. ఎన్కౌంటర్ కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: