బీహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. ఒక సింగర్ ని అత్యంత దారుణంగా హత్య చేసారు. పట్నాలో భోజ్‌పురి గాయకుడుని హత్య చేయడంతో అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పట్నాకు స‌మీపంలో ఉన్న సచే జానిపూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఉన్న సిమ్రా గ్రామంలో ఈ హత్య జరిగింది. 

 

అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ భోజ్‌పురి గాయకుడు రంజన్ కుమార్ సింగ్ ని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసారు. రంజ‌న్ కుమార్‌ ఇంటి వ‌ద్ద‌కు సోమవారం రాత్రి 12 గంటల సమయంలో కొందరు దుండగులు వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారు అని అధికారులకు కుటుంబ సభ్యులు వివరించారు. జాతీయ రహదారి 98 సమీపంలో ఉన్న ఒక  ఇసుక దిబ్బ‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: