ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ కూడా భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మంత్రులకు ఎమ్మెల్యేలకు కరోనా సోకుతుంది. వీరిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటక లో ఒక మంత్రి భార్యకు ఆయన గారి కూతురికి కరోనా సోకింది. కర్ణాటక రాష్ట్ర వైద్యవిద్యాశాఖ మంత్రి కే సుధాకర్ తండ్రికి కూడా కరోనా సోకింది. భార్య, కుమార్తెలకు కరోనా రావడంతో మంత్రి గారు భయపడుతున్నారు. 

 

మంత్రి సుధాకర్ తండ్రి దగ్గు, జ్వరంతో బాధపడగా ఆయనకు కరోనా పరిక్షలు నిర్వహించగా కరోనా ఉందని తెలిసింది. దీనితో ఆయనను క్వారంటైన్ చేసారు అధికారులు. ఆ తర్వాత మంత్రి గారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరిక్షలు చేయగా ఒక్క మంత్రి గారు మాత్రమే కరోనా నెగటివ్ గా బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: