దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరిక్షల సంఖ్యను కూడా అదే విధంగా పెంచుతున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా పరిక్షల సంఖ్యను పెంచుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదిలా ఉంటే జూన్ 22 వరకు మొత్తం కరోనా పరీక్షలను 71,37,716 చేసామని ఐసిఎంఆర్ ప్రకటించింది. 

 

నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 1,87,223 మందికి కరోనా పరిక్షలు చేసామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది. కాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర ఢిల్లీ, తమిళనాడు, ఏపీలో ప్రతీ రోజు కూడా 30 వేలకు పైగా కరోనా పరిక్షలు చేస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు అత్యధికంగా కరోనా పరిక్షలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: