వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక వర్గం నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తనకు ఓ వర్గం వారి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తాజాగా వ్యాఖ్యలు చేసారు. తనను చంపెస్తామంటూ బెదిరిస్తున్నారన్న ఆయన ఇలాంటి కాల్స్ పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. 

 

దీనిపై స్థానికంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టే విషయంలో పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆయన... కానీ అధికారపార్టీ ఎంపీ చేసిన ఫిర్యాదులు పట్టించుకోవడంలేని మండిపడ్డారు. అందుకే దీనిపై లోక్ సభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: