ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరోసారి రాష్ట్రంలో 400 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 462 మందికి కరోనా సోకింది. ఎపీకి చెందిన వారికి 407 మందికి కరోనా సోకింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పది వేలకు దగ్గరగా ఉన్నాయి. రాష్ట్రంలో 9 వేల 9834 మందికి కరోనా సోకిందని ఏపీ సర్కార్ పేర్కొంది. 

 

విదేశాల నుంచి వచ్చిన 15 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 20 వేల 639 మందికి కరోనా పరిక్షలు చేసారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 87 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: