గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మార్చిలో మొదలైన కేసులు మెల్లి మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి.  ఇతర జిల్లాల్లో పరిస్థితి పక్కనబెడితే జీహెచ్ఎంసీ పరధిలో మాత్రం కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  మొన్న ఏడు వందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.  అయితే కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఎంతో మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది.

 

ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగుల జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. జీతంలో కోత పడటంతో... ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక తరపున ప్రతినిధులు ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిశారు. ఈ విషయం పై సానుకూలంగా స్పందించారు మంత్రి హరీష్ రావు. తర్వాత ఐక్యవేదిక ప్రతినిధులు ఒక ప్రకటనను విడుదల చేశారు. 

 

ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల నుంచి పూర్తి వేతనాలను చెల్లించేందుకు మంత్రి అంగీకరించారని వెల్లడించారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి పెన్షన్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలనుకుంటున్నట్టు తెలిపారని చెప్పారు. కాగా, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మాత్రం తమ బకాయి జీపీఎఫ్ లో కాకుండా నగదు రూపంలో చెల్లించాలని కోరినట్లు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: