ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం విషయంలో... ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సరే అక్రమ మద్యం మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కూడా ఈ అక్రమ మద్యం కేసులు సరిహద్దుల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎక్కువగా అక్రమ మద్యం కేసులు నమోదు అవుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ విషయంలో ఏపీ పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైకోర్ట్ లో పిటీషన్ కూడా దాఖలు అయింది. విచారణను రేపటికి వాయిదా వేయగా పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో డీజీపీ గౌతం సవాంగ్ ని హైకోర్ట్ రావాలని కోర్ట్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: