దళిత జడ్జి ని తాను ఎన్నికల కమీషనర్ గా నియమిస్తే ఇందుకే కుట్ర జరిగింది అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు చేసారు. దళిత ఎన్నికల కమీషనర్ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కుట్రలు చేసారని ఆయన ఆరోపించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన... 

 

రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడమే చంద్రబాబు పని ఆయన విమర్శలు చేసారు. ఒక పక్క కేసు సుప్రీం కోర్ట్ లో ఉండగా ఏ విధంగా కుట్రలు చేస్తారని ఆయన నిలదీశారు. అసలు ఎం జరిగింది అనేది నిజాలు బయటపెట్టాలి అని ఆయన సవాల్ చేసారు. సుప్రీం కోర్ట్ కి తాము అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని, దీని మీద విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: