కరోనా లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమకు షూటింగ్ అనుమతులు ఇచ్చింది తెలంగాణా సర్కార్. ఈ నేపధ్యంలోనే పలు టీవీ సీరియల్స్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలయింది. అయితే షూటింగ్ లో పాల్గొనే వారు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు అని తెలుస్తుంది. దీనితో టీవీ పరిశ్రమలో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. 

 

ఇక ఒక సీరియల్ యూనిట్ మొత్తానికి కూడా కరోనా సోకింది అని తెలుస్తుంది. దీనితో షూటింగ్ లు అన్నీ కూడా ఆపేశారు. కనీస జాగ్రత్తలు అసలు తీసుకోలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక షూటింగ్ లను నిలిపివేయాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై  రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం వంద మంది కార్మికులకు కరోనా వచ్చినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: