బిజెపి నేతలు సుజానా చౌదరి, కామినేని శ్రీనివాస్ ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిస్తే తప్పు ఏంటీ అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆ ముగ్గురు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖం ఆనందంతో వెలిగిపోతుందన్న ఆయన... ఏదో పెద్దపెద్దగా మాట్లాడుతున్నారని, హావభావాలు చూపిస్తూ నటిస్తున్నారని ఎద్దేవా చేసారు. 

 

దొంగ దొరికాడని అంబటి అంటున్నారన్న ఆయన... అసలు ఎవరు దొంగ అని నిలదీశారు. ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లారన్నారు. ఏపీ ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకువెళ్లమని చెప్పడానికి వెళ్లినట్టున్నారున్నారని వ్యాఖ్యానించారు. అసలు నిమ్మగడ్డ ఎందుకు రాజీనామా చెయ్యాలి అని ఆయన ప్రశ్నించారు. వారేమైనా అసాంఘీక శక్తులా? వారేమైనా నేరస్తులా అని నిలదీశారు. వారు అసాంఘిక శక్తులా అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: