తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 879 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. 
 
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,553కు చేరగా మరణాల సంఖ్య 220కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రస్తుతం 5,109 యాక్టివ్ కేసులు ఉండగా 4,224 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: