ఆంధ్రప్రదేశ్ పోలీసుల పని తీరుపై సిఎం వైఎస్ జగన్ గత కొంత కాలంగా సంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే. రాజీ లేకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు అని సిఎం పలు సందర్భాల్లో వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి వారి విషయంలో సిఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేసారు. 

 

పాస్‌పోర్ట్  వెరిఫికేషన్, క్లియరె‌న్స్‌లో ఏపీ పోలీస్‌ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో అవార్డు దక్కించుకున్న నేపధ్యంలో సిఎం హర్షం వ్యక్తం చేసారు. వరుసగా రెండోసారి ఏపీ పోలీస్‌ శాఖకు మొదటి స్థానం వచ్చింది. దీనిపై జగన్ పిలీసులను అభినందించారు. భవిష్యత్తు లో కూడా ఇదే విధంగా ఉత్సాహంగా పని చేసి పోలీస్ శాఖను ఉన్నతంగా నిలబెట్టాలి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: