ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు  పెరుగుతూనే ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 36 వేల కరోనా పరిక్షలు చేయగా 448 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8306 పాజిటివ్ కేసు లకు గాను 3712 మంది డిశ్చార్జ్  అయ్యారు. ఇప్పటి వరకు 129 మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

ఇక యాక్టివ్ కేసులు 4465 గా ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా కర్నూలులో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు గుంటూరు జిల్లాలో ఇద్దరు శ్రీకాకుళం లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అనంతపురం లో 90 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: