ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులతో పాటుగా మరణాలు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే ఇప్పుడు మరణాలు కూడా అదే స్థాయిలో  పెరుగుతున్నాయి.  మొన్నటి వరకు ఒకరు ఇద్దరు కరోనాతో మరణించారు. నేడు ఏకంగా 10 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో నలుగురు ఒక్క రోజే మరణించారు. 

 

కృష్ణా జిల్లాలో ముగ్గురు ఒక రోజే ప్రాణాలు కోల్పోగా గుంటూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళ౦ జిల్లాలో ఒక మరణం నమోదు అయింది. గత వారం రోజులుగా ప్రతీ రోజు కూడా 5 మందికి పైగా మరణిస్తున్నారు. నిన్న ఒక్క రోజే 8 మంది వరకు మరణించారు. మొత్తం మరణాలు రాష్ట్రంలో 129 గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: