ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు అధికారులు నాయకులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పోలీస్ శాఖలో ఎంతోమంది అధికారులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు.
తాజాగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఐటి విభాగంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఆ కార్యాలయాన్ని మొత్తం శానిటైజ్ చేయించారు అధికారులు. అలాగే గాజులరామారం జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.