కరోనా దెబ్బకు బాగా ఇబ్బంది పడుతున్న వారిలో ముఖ్యంగా వృద్దులే ఉన్నారు. వారే ఎక్కువగా కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొందరు వృద్దులు మాత్రం కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని బయటపడుతున్నారు. కరోనా బారిన పడిన 93 వృద్ధురాలు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల  కరోనా రావడంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసారు. 

 

ఇక అక్కడి నుంచి ఆమె విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలా క్రమంగా ఆమె వైరస్ నుంచి బయటపడ్డారు. సాధారణంగా ఇంత వయసు ఉన్న వారు కరోనా నుంచి కోలుకోవడం అనేది కష్టం అని కాని... ఆమె బయటపడ్డారు అని పేర్కొన్నారు. ఇక ఆమె కుటుంబం లో నలుగురు కరోనా బారిన పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: