ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు అని టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. పోస్టులు పెట్టారని ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో అశ్లీలంగా, సీఎం జగన్ గౌరవానికి భంగం కలిగే రీతిలో పోస్టులు పెడితే వారిపై కేసులు పెట్టవచ్చునన్నారు. 

 

వైసీపీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే పోలీసులు తీసుకుని చర్యలు తీసుకుంటున్నారన్న ఆయన... అదే టీడీపీ కానీ, ఇతర పార్టీలకు చెందినవారు ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: