కరోనా వైరస్ ఏమో గాని అది వచ్చింది అని తెలిస్తే చాలు ముందు ఆస్పత్రుల్లో ఉండటానికి చాలా మంది భయపడుతున్నారు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆస్పత్రుల్లోకి వెళ్ళాలి కరోనా చికిత్స తీసుకోవాలి అంటే చాలు ప్రజల్లో ఎక్కడ లేని భయం ఉంది. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడులో కరోనా పాజిటివ్ వచ్చిన ఒక రోగి పాజిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి పరారు అయ్యాడు. 

 

కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళగా అతనికి కరోనా పరిక్షలు నిర్వహి౦చారు వైద్యులు. అతనికి కరోనా ఉంది అని చెప్పడంతో ఆస్పత్రి నుంచి పరారు అయ్యాడు. ఇక ప్రభుత్వ వైద్యుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: