13 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కాపులకు ఇచ్చిన మాటను సిఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. కాపుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన వివరించారు. కాపులకు సిఎం చేదోడు వాదోడుగా ఉంటారని అన్నారు. 

 

కాపుల పాలిట చంద్రబాబు సర్కార్ రాక్షస పూరితంగా వ్యవహరించింది అని అంబటి ఆరోపించారు. ఐదేళ్ళ లో 5 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు గొప్పలు చెప్పారు అని అంబటి ఆరోపించారు. కాపులను కేసులు పెట్టి వేధించారు అని ఆయన ఆరోపించారు. కాపుల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. గత ప్రహుత్వం జన్మభూమి కమిటీల పేరిట దోచుకుందని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: