కరోనా లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరిక్షలు చేయించుకోవాలని ఊరికే కరోనా పరిక్షల కోసం రావొద్దు అని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రైవేట్ ల్యాబ్స్ కూడా కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరిక్షలు చెయ్యాలి అని ఆయన సూచించారు. 

 

కరోనా లక్షణాలు ఉన్న వారు హోం ఐసోలేషన్ లో ఉండాలి అని అది సాధ్యం కాకపోతే ఐసోలేషన్ ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వివరించారు. తాము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అనవసరంగా కరోనా పరిక్షలు చేయి౦చుకోవద్దు అని ఆయన అన్నారు. బాధ్యత లేని వాళ్ళు విమర్శలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: