నిమ్మగడ్డ చంద్రబాబు నియమించిన వ్యక్తి అని మేము కలిస్తే తప్పు ఏంటీ అని బిజెపి ఎంపీ సుజనా చౌదరి ఎందుకు చెప్పలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. సుజనా, కామినేని శ్రీనివాస్ ని కలిసిన విషయాన్ని నిమ్మగడ్డ ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా నియమించడానికి వేల కోట్లు ఖర్చు చేసామని చెప్పండి. 

 

నిమ్మగడ్డ కోసం కాస్ట్లీ లాయర్లను నియమించామని చెప్పండి అంటూ అంబటి వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన... పార్క్ హయత్ హోటల్ లో కలవడం వెనుక అంతర్యం ఏంటీ అని నిలదీశారు. సీసీ ఫూటేజ్ బయటకు వచ్చాకే కలిసామని చెప్పారని, 13 వ తేదీ కలిస్తే ఎందుకు చెప్పలేదని నిలదీశారు అంబటి. చంద్రబాబు చెప్తే కలిసామని ఎందుకు చెప్పడం లేదన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: