హోటల్ హయత్ లో రహస్య భేటీ వెనుక అంతర్యం ఏంటీ అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిలదీశారు. 13 వ తేదీన కలిస్తే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. సుజనా కామినేని బిజెపి ముసుగులో అనైతిక కార్యాకలపాలకు పాల్పడుతున్నారు అని అంబటి మండిపడ్డారు. వారిపై బిజెపి అధిష్టానం చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయన. 

 

కలిస్తే తప్పు ఏంటీ అని అడుగుతున్నారు అంటే ఎంత బరి తెగించారో అర్ధమవుతుందని ఆయన  విమర్శించారు. వారు ఎందుకు కలిసారో చంద్రబాబు దర్శకత్వంలోనే కలిసారు అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు అని అంబటి మండిపడ్డారు. సీసీ టీవీ ఫూటేజ్ బయటకు వస్తే ఇప్పుడు కలిసామని చెప్తున్నారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు నియమించిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: