హైదరాబాద్  పార్క్ హయత్ హోటల్ లో బిజెపి ఎంపీ సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ కలవడంపై వైసీపీ అగ్ర నేత, రాజకీయ సలహాదారు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. “తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నాడో ప్రబుద్ధుడు స్టార్‌ హోటళ్లో ఎందుకు కలిశారంటే ఆ ముగ్గురూ చెప్తున్న సమాధానాలు ఇలానే ఉన్నాయి. 

 

నిమ్మగడ్డ 6వ ఫ్లోర్‌ వరకూ లిఫ్టులో వెళ్లి అక్కడనుంచి 8వ లిఫ్టు వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారు? సుజనా, కామినేని బీజేపీ మనుషులన్న టీడీపీ, కేంద్రానికి విజ్ఞాపనపత్రం తయారుచేయడానికే మీటింగు పెట్టుకున్నారంటూ ఈ రహస్యభేటీని టీడీపీ వర్లరామయ్య తన భుజాలమీదకు ఎందుకు ఎత్తుకున్నారు? ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు? బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులతో భేటీ కుమ్మక్కు కాదా? స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా? స్టార్‌ హోటల్‌ వ్యవహారాన్ని కోర్టుల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారా?” అని ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: