భారతదేశంలో పూజలకు, అదే విధంగా దేవుళ్ళను కొలిచే విషయంలో రాజీ పడే అవకాశమే ఉండదు. పూర్వికులు మనకు ఇచ్చిన ప్రతీ ఒక్కటి కూడా ఈ తరం కూడా అమలు చేస్తూ ఉంటుంది. రథయాత్రలు గాని ఇతర పూజా కార్యక్రమాలు గాని వందల ఏళ్ళ నుంచి కూడా ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే కచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారు.
తాజాగా కర్ణాటకలో మధురమ్మ అనే దేవతకు రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక రథం చాలా ఎత్తు ఉంది. దానిని అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ఇబ్బంది రాకుండా వందల మంది ప్రజలు ముందుకు నడిపిస్తున్నారు. మదురమ్మ దేవత యొక్క అతిపెద్ద రథంలో ఒకటి... హుస్కూర్ బెంగళూరు సమీపంలో అంటూ ట్విట్టర్ లో హిందు దేవాలయాలకు సంబంధించిన ఒక ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసింది.
Unbelievable Proud of My Ancestors!!
— hindu Temples Info (@BharatTemples_) June 24, 2020
One of the Largest Chariot of goddess Madduramma.
Huskur Near Bangalore. pic.twitter.com/77XRQeX3Vy