నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి అందరూ కలిసి ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు కి నిమ్మగడ్డ కావాలి గాని ప్రజా స్వామ్యం కాదని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా అర్హుడు కాదని అన్నారు. సుజనా చౌదరికి నిమ్మగడ్డ కు ఏం వ్యాపారాలు ఉన్నాయని ఆయన నిలదీశారు. 

 

చంద్రబాబు కి... సుజనా కామినేని సహకరిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ లేఖ ఆయన రాయలేదు అని టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిందని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇక రఘురామ కృష్ణం రాజుకి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకే నోటీసులు ఇచ్చామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: