ఆ రైతు ఎంతో కష్ట పడి చేపల చెరువును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అదే చెరువు తనను మింగేస్తుందని రైతు ఊహించలేకపోయాడు. ఈ ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెంలో జరిగింది.

 

చేపల పెంపకం కోసం ఏర్పాటు చేసిన చెరువే ఆ రైతును మింగేసింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన లింగం లక్ష్మారెడ్డి తన చేపల చెరువులోకి స్నానానికని వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయాడు.

 

 

లక్ష్మారెడ్డితో పాటు వచ్చిన పాలేరు... తన యజమానిని కాపాడేందుకు యత్నించగా ఫలితం లేకుండా పోయింది. చూస్తుండగానే నీటిలో మునిగిపోయి ప్రాణాలొదిలాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లక్ష్మారెడ్డి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: