మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా దానికి తోడు గా ఓ వ్యక్తి తాగిన మైకంలో స్కూటర్​తో ఏకంగా పోలీసులనే ఢీకొట్టాడు.ఈ ఘటనలో  ఎస్సై ను  గాయపరిచాడు.

చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పోలీసులను స్కూటర్ తో గుద్దాడు.బుధవారం రాత్రి పాకాలలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వాహనదారుడు తాగిన మైకంలో స్కూటర్​తో పోలీసులపైకి దూసుకొచ్చాడు. ఘటనలో పాకాల ఎస్​ఐ రాజశేఖర్​కు స్వల్ప గాయాలయ్యాయి. సహచర సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. మధ్యం సేవించి బండి నడిపిన వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

మధ్యం సేవించిన తరువాత వాహనం నడపకుడడు అని ఎన్ని చట్టాలు తెచ్చినా, శిక్షలు ఎంత కఠినం చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. తాగి బండి నడిపి ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కును దూరం చేస్తున్నారు. వీరిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఎంటో..!

మరింత సమాచారం తెలుసుకోండి: