ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. నాయుడుపాలెం, బాపూజీనగర్ మధ్య వంతెనను గూడ్స్ రైలు దాటుతుండగా..... చివరన ఉన్న డీజిల్ లోడ్ బోగీలు విడిపోయి వాటికి మంటలు అంటుకున్నాయి.
టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. నాయుడుపాలెం, బాపూజీనగర్ మధ్య వంతెనను గూడ్స్ రైలు దాటుతుండగా చివరన ఉన్న డీజిల్ లోడ్ బోగీలు విడిపోగా వాటికి మంటలు అంటుకున్నాయి. ట్రాక్ కుంగిపోవటంతో పట్టాలు తప్పి వంతెనపైనుంచి బోగీలు కిందపడ్డాయి. గూడ్స్ రైలు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. కేవలం ఈ ప్రమాదంలో డీజిల్ లోడ్ భోగీలు విడిపోవడం వలన మంటలు ఏర్పడినట్లు తెలుస్తోంది. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తమ ప్రయత్నాలు తాము నిమగ్నమై ఉన్నారు.