వరుస ఎన్కౌంటర్ లు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో భారత బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వరుసగా దాడులకు దిగుతున్నాయి. నిఘా వర్గాల సమాచారం వస్తే చాలు వెంటనే రంగంలోకి దిగి కాల్పులకు దిగుతున్నాయి. ఇక తాజాగా మరోసారి భారత బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 

 

సోపోర్‌లోని హర్దిష ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని ఆర్మీ అధికారులు వివరించారు. పోలీసులు మరియు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి అని జమ్మూ & కాశ్మీర్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి బలగాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: