మేడ్చల్ జిల్లా పద్మనగర్​లో ప్రముఖ బ్రాండ్​ పేరుతో నకిలీ షాంపులు, కంఫర్ట్ తయారుచేస్తున్న ఓ ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యజమాని మహబూబ్​ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

ప్రభుత్వం నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్నా కొందరు అక్రమార్కులు డబ్బు సంపాదనే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. మేడ్చల్ జిల్లా పేట్​బషీరాబాద్ పరిధి పద్మానగర్​లో ఓ ఇంట్లో ప్రముఖ బ్రాండ్​ పేరుతో నకిలీ షాంపూ, కంఫర్ట్ తయారుచేస్తున్నారనే సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.

 

 

సికింద్రాబాద్​కు చెందిన మహబూబ్​ఖాన్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా అక్రమంగా ఈ ప్రాంతంలో ప్రముఖ బ్రాండ్ పేరుతో నకిలీ షాంపూ, కంఫర్ట్ తయారు చేస్తున్నాడు. పోలీసులు దాడి చేసే సమయంలో ముగ్గురు కార్మికులు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహబూబ్​ఖాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షాంపూ తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు అరవై లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: