ప్రకాశం జిల్లాలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అని అధికారులు పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న రైలు నుండి మూడు డీజిల్ ట్యాంకర్లు క్రింద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అని అధికారులు వెల్లడించారు. 

 

 ట్యాంకర్లు క్రింద పడటంతో భారీగా మంటలు రావడంతో మూడు డీజిల్ ట్యాంకర్లు పూర్తిగా కాలిపోయాయి అని అధికారులు వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు భోగీలను రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇంకా మంటలు అదుపులోకి రాలేదు అని తెలుస్తుంది. మూడు ఫైర్ ఇంజిన్ లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: