టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న అవార్డ్ గెలుచుకోవడంపై సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అలాగే ఇతర నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా రామ్మోహన్ నాయుడు కి శుభాకాంక్షలు చెప్తున్నారు.
చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా రామ్మోహన్ నాయుడు కి శుభాకాంక్షలు చెప్పారు. పార్లమెంటు సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు, ఒక ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు గుర్తింపుగా "సంసద్రత్న" అవార్డుకు ఎంపికైన ఎంపీ రామ్మోహన్ నాయుడుకు అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేసారు. అతి చిన్న వయసులోనే ఈ అవార్డు అందుకోనున్న ఎంపీగా, ఇది మీకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణమని అన్నారు.
పార్లమెంటు సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు, ఒక ఎంపీగా ప్రజాసమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు గుర్తింపుగా "సంసద్రత్న" అవార్డుకు ఎంపికైన ఎంపీ @RamMNK కు అభినందనలు. అతి చిన్న వయసులోనే ఈ అవార్డు అందుకోనున్న ఎంపీగా, ఇది మీకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం pic.twitter.com/vHBpc1DjHQ
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) June 24, 2020