తేలు కాటుకు గురై ఓ యువకుడు మృతి చెందిన దుర్ఘటన   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో చోటుచేసుకుంది. శ్రీరామ్ అనే యువకుడు సెట్రింగ్ కర్రల్ని తీస్తుండగా తేలు కరిచింది. వెంటనే  ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో తేలు కాటుకు గురై శ్రీరామ్ రాణా ప్రతాప్(28) అనే యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో సెంట్రింగ్​ కర్రల్ని  ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. సెట్రింగ్ కర్రల్ని తీస్తుండగా తేలు గట్టిగా కరిచింది. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు జానంపేట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. మెరుగైన వైద్యం కోసం భద్రచాలం ఆ తర్వాత ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా ప్రతాప్​ తుదిశ్వాస విడిచాడు. చెట్టంత కొడుకు తమ ముందే మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: