సాయికిరణ్, ప్రణీత్ అనే ఇద్దరు స్నేహితులు బుధవారం రాత్రి బైకుపై పక్క గ్రామానికి వెళ్తుండగా ఎడ్లబండిని ఢీకొని ఒకరు మరణించగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చిర్రకుంట గ్రామసమీపంలో జరిగింది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో చిర్రకుంట గ్రామ సమీపంలో బైకు ఎడ్లబండిని ఢీకొన్న దుర్ఘటనలో ఓ యువకుడు మరణించాడు. సాయికిరణ్, ప్రణీత్ ఇద్దరు స్నేహితులు వారు బైకుపై పాడిబండ గ్రామానికి వెళ్తున్నారు. దాంపూర్ నుంచి చిర్రకుంట వస్తున్న ఎడ్లబండిని వీరి వాహనం ఢీకొనగా సాయికిరణ్ అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడ్డ ప్రణీత్ను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
వీరిద్దరూ ఆటో నడుపుతూ తమ కుటుంబాలను పోషించు కుంటున్నారు. ఈ ప్రమాదఘటన తెలుసుకున్న కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గత నెలలో ప్రణీత్ తండ్రి మరణించగా ,ఈ ఘటన ఆ కుటుంబాన్ని మరింత కలచివేసింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.