ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ తాజాగా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చని.... నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న అని ట్వీట్ చేశారు. నిన్న హైదరాబాద్ లో ఆయనపై పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు. విక్రమ్‌ కైలాష్ అనే వ్యక్తి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తన ఇంటి నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంటే పీవీపీ అనుచరులతో వచ్చి దాడి చేశారని పేర్కొన్నారు. 
 
పోలీసు కేసు నమోదు చేసుకుని 41 సీఆర్పీసీ కింద పీవీపీకి నోటీసులు ఇచ్చారు. నిన్న బంజారాహిల్స్ పోలీసులు పీవీపీని విచారించారు. ఈరోజు కూడా విచారణ కొనసాగనుంది. విల్లాలు విక్రయించినప్పుడు ఎలాంటి రూఫ్‌ టాప్‌ల నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో ఉందని పీవీపీ చెబుతున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: