ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది పవన్ కళ్యాణ్ సతీమణి రేణూ దేశాయ్. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే మహేష్ బాబు నిర్మాతగా యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఇది తెరకెక్కుతుంది, అయితే ఈ సినిమాలో రేణు దేశాయ్ నటించబోతున్నారు. మహేష్ బాబు మేజర్ సినిమా లో రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.