తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాత్కాలికంగా ఈ నిర్ణయానికి బ్రేక్ పడింది. ఇప్పటికే భారీగా నమూనాలను సేకరించడంతో టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాని కారణంగా నేడు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 891 మందికి కరోనా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 10,444కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,858 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 225 మంది మృతి చెందారు. 4,361 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండటంతో నగరవాసులు టెన్షన్ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: