తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా నిర్ధారణ అయింది. ఐదుగురు సిబ్బందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. డ్రైవర్లు, గన్ మెన్లకు కరోనా నిర్ధారణ కావడంతో రాజాసింగ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 891 కేసులు నమోదయ్యాయి. జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్‌, బీగాల గణేష్‌ గుప్తాకు కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: