అదిలాబాద్ జిల్లా చెన్నూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందు వీరు టిక్ టాక్ వీడియోలు చేశారని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పవన్, సాయితేజ హైదరాబాద్ లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించేవారు. లాక్ డౌన్ వల్ల వీరు చెన్నూరుకు వచ్చారు. చెన్నూరు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
స్కూటీపై పవన్, సాయితేజ్ వెళుతున్న సమయంలో టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు చెన్నూరు వడ్రంగి కాలనీకి చెందినవారు. ఇద్దరు స్నేహితులు మృతి చెందటంతో వడ్రంగి కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి ముందు పవన్, సాయితేజ్ చేసిన టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: