ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ చాప కింద నీరులా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా భారీన పడ్డారు. నిన్నటినుంచి కన్నడ స్టార్ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి కరోనా భారీన పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో దర్శన్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దర్శన్ భార్య విజయలక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.... కరోనా సోకిందని వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టతనిచ్చారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
If you’ve heard any rumours that I’ve been tested covid positive .
— Vijayalakshmi (@vijayaananth2) June 24, 2020
This is to let you’ll know I’m perfectly fine. Everyone stay safe during these hard times😊