ఇటీవల చైనా సరిహద్దు లో చోటు చేసుకున్న ఘర్షణలో  తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్  సంతోష్ బాబూ తో  పాటు 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి మరో జవాన్  కూడా అమ్రుడైనట్లు  తాజాగా అధికార వర్గాలు తెలిపాయి. 


 మహారాష్ట్రలోని మలేగావ్  తాలూకా సాకురి  గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ వీర మరణం పొందినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాల్వాన్ లో  విధి నిర్వహణలో ఉండగా నదిలో పడి పోయిన ఇద్దరు ని కాపాడే ప్రయత్నంలో వీరమరణం పొందినట్లు  ఆర్మీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: